సోషల్మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది యువ నాయిక జాన్వీకపూర్. వర్కవుట్స్ తాలూకు వీడియోల్ని పంచుకోవడంతో పాటు ఫొటోషూట్లలో అందాల్ని ఆరబోస్తూ అభిమానుల్ని కవ్విస్తుంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఈ భామకు 21 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అయితే సోషల్మీడియాలో లభించే ప్రాచుర్యం కేవలం వ్యక్తిగత ఛరిష్మాకు, బ్రాండ్ ప్రమోషన్కు మాత్రమే పని చేస్తుందని, సినిమా విజయాన్ని అది ఏమాత్రం నిర్ణయించదని చెప్పింది జాన్వీకపూర్. ఇటీవల ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది.
తన తాజా చిత్రం ‘మిలీ’ కి ఆశించినంతగా వసూళ్లు రాలేదని, ఇన్స్టాగ్రామ్లో తనను ఫాలో అవుతున్న 21 మిలియన్ల అభిమానులు ఆ సినిమా చూసినట్లయితే బంపర్హిట్గా నిలిచేదని చమత్కరించింది. ఆమె మాట్లాడుతూ ‘సోషల్మీడియా ఫాలోయింగ్ను స్టార్డమ్ను ప్రామాణికంగా తీసుకోలేం. కొన్ని క్రియేటివ్ ఐడియాలను షేర్ చేసుకోవడానికి, అభిమానులతో నిత్యం టచ్లో ఉండటానికి సోషల్మీడియా ఉపయోగపడుతుంది. ైమొత్తంగా చూస్తే సెల్ఫ్ప్రమోషన్ కోసం జరిపే ఓ టైమ్పాస్ వ్యవహారమది. సినిమా తాలూకు స్టార్డమ్, వసూళ్లను సోషల్మీడియా ఎప్పటికీ ప్రభావితం చేయలేదు’ అని పేర్కొంది.