తమిళ నటుడు సూర్యకు దేశవ్యాప్తంగా పేరు తీసుకొచ్చిన సినిమా ‘జై భీమ్’. ఈ చిత్రాన్ని సూర్య తన నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్స్పై నిర్మించారు. టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటీటీలో విడుదలై మంచి విజయం సాధించింది.
తాజాగా ఈ కలయికలో మరో సినిమా రాబోతున్నట్లు తెలుస్తున్నది. సూర్య కోసమే ఒక మంచి కథను టీజే జ్ఞానవేల్ సిద్ధం చేశారనీ, ఆ కథ సూర్యకు బాగా నచ్చడంతో సినిమాకు అంగీకరించారని సమాచారం.