94వ ఆస్కార్ అవార్డ్ల ఉత్సవానికి తెరలేచింది. పలు విభాగాల్లో ఈ ఏడాది నామినేషన్స్కు ఎంపికైన చిత్రాల వివరాల్ని మంగళవారం ఆస్కార్ కమిటీ ప్రకటించింది. ఉత్తమ సినిమా, ఉత్తమ నటి, ఉత్తమ నటుడు వంటి విభాగాల్లో పోటీలో నిలబోతున్న సినిమాలు, నటీనటుల వివరాల్ని వెల్లడించారు. ది పవర్ ఆఫ్ డాగ్, వెస్ట్ సైడ్ స్టోరీ, కింగ్ రిచర్డ్, భెల్ఫాస్ట్ చిత్రాలు ఈ ఏడాది ఎక్కువ విభాగాల్లో నామినేషన్స్ను సొంతం చేసుకున్నాయి. మార్చి 27న అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.
నిరాశపరచిన ‘జై భీమ్’
భారత్ నుంచి ఈ ఏడాది ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘జైభీమ్’ చిత్రానికి ఈ నామినేషన్స్లో నిరాశే మిగిలింది. సూర్య హీరోగా సామాజిక ఇతివృత్తంతో రూపొందిన ఈ సినిమా ఉత్తమ చిత్రం లేదా ఉత్తమ విదేశీ చిత్ర విభాగాల్లో ఆస్కార్ బరిలో నిలుస్తుందని అంతా భావించారు. అయితే ఈ రెండు విభాగాల్లో ‘జైభీమ్’ చోటు సంపాదించుకోలేకపోయింది.