ఇప్పటివరకు తాను చేసిన చిత్రాల్లో ‘పెద్ది’ చాలా ప్రత్యేకమని, ఇందులో అప్పలసూరిగా బలమైన భావోద్వేగాలు కలబోసిన పాత్రలో కనిపిస్తానని, ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర ఇదని చెప్పారు సీనియర్ నటుడు జగపతిబాబు. రామ్చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా జూన్ 4న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం జగపతిబాబు విలేకరులతో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.