జీ తెలుగులో.. ఈ నెల 21 నుంచి సరికొత్త ధారావాహిక ‘జగద్ధాత్రి’ సందడి చేయనుంది. ఈ డైలీ సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7.30 గంటలకు ప్రసారమవుతుందని నిర్వాహకులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ‘జగద్ధాత్రి’ అనే మహిళా సీక్రెట్ ఏజెంట్ చుట్టూ ముడిపడిన పరిస్థితులే ఈ సీరియల్ కథాంశం. అసాధారణమైన కథతోపాటు ఊహించని మలుపులతో ఈ సీరియల్ ఉత్కంఠ భరితంగా సాగిపోతుందని ‘జగద్ధాత్రి’ టీమ్ చెబుతున్నది. నటి దీప్తి మన్నె టైటిల్ రోల్ పోషిస్తున్నది. ‘రాధమ్మ కూతురు’గా జీ తెలుగు ప్రేక్షకులకు చేరువైన దీప్తి మరో పవర్ఫుల్ పాత్రతో మరోసారి పలకరిస్తున్నది. దివ్యాంగుల పాఠశాల నిర్వహిస్తున్న ఓ సాధారణ మహిళ అక్రమార్కులను ఎదిరించే క్రమంలో అపరకాళిగా ఎలా మారిందో ‘జగద్ధాత్రి’లో చూపించబోతున్నారు.