Itlu Maredumilli Prajaneekam Movie | రాజేంద్రప్రసాద్ తర్వాత ఆ స్థాయి హస్య నటుడిగా టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లరి నరేష్. తన నటన, కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాడు. అయితే జబర్దస్త్ వంటి పలు కామెడీ షోలు రావడంతో అల్లరి నరేష్ సినిమాలకు ఆదరణ తగ్గిపోయింది. దాంతో నరేష్ను వరుసగా ఫేయిల్యూర్ పలుకరించాయి. ఈ క్రమంలో నాంది వంటి సీరియస్ సబ్జెక్ట్తో వచ్చి సక్సెస్ అయ్యాడు. గతేడాది రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. అదే జోష్లో ఇటీవలే ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం వంటి మరో సీరియస్ సబ్జెక్ట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఏ.ఆర్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. కానీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. పోటీగా ఎలాంటి సినిమాలు లేకపోయిన, బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా డిజిటల్ రిలీజ్కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను జీ-5 సంస్థ దక్కించుకుంది. ఇక డిసెంబర్ 23నుండి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఆనంది హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని జీ-స్టూడీయోస్, హాస్య మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.