అదిరే యాక్షన్ ఉన్న చిత్రాలే పాన్ ఇండియా స్థాయిలో విజయాలు సాధిస్తున్నాయి. ‘బాహుబలి’, ‘పుష్ప’, ‘కేజీఎఫ్’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి సినిమాల్లో పోరాట ఘట్టాలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో చూశాం. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ 30ని రూపకల్పన చేస్తున్నారు దర్శకుడు కొరటాల శివ. పాన్ ఇండియా అప్పీల్ కోసం యాక్షన్ సీక్వెన్సుల రూపకల్పనలో భారీతనం ఉండేలా జాగ్రత్తపడుతున్నారట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శంషాబాద్లో జరుగుతున్నట్లు సమాచారం.
రాత్రి షూటింగ్స్లో ఫైట్స్ పిక్చరైజ్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ బ్రాడ్ మిన్నిచ్, యాక్షన్ ప్రొడ్యూసర్ కెన్నీ బేట్స్ను పనిచేస్తున్నారు. వీరితో వరల్డ్ క్లాస్ ఔట్ పుట్ తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. బాలీవుడ్ తార జాన్వీ కపూర్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కళ్యాణ్రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కొసరాజు హరికృష్ణ, సుధాకర్ మిక్కిలినేని నిర్మాతలు. దక్షిణాది భాషలతో పాటు హిందీలో వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.