అంజలి కథానాయికగా రూపొందిన హారర్ సినిమా ‘గీతాంజలి’ అప్పట్లో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ పేరుతో ఆ సినిమాకు సీక్వెల్ రూపొందనుంది. ఫస్ట్ పార్ట్లో చేసిన అంజలి, శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేశ్, సత్య, షకలక శంకర్ ఇందులో కూడా నటిస్తారు. శివ తుర్లపాటి దర్శకుడు. ఎంవీవీ సత్యనారాయణ, జీవీ నిర్మాతలు. కోన వెంకట్ ఈ సినిమాకు సమర్పకుడు. ఆయనే కథ, స్క్రీన్ప్లే కూడా అందించారు. శనివారం ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి రామచంద్ర క్లాప్ కొట్టారు.
స్క్రిప్ట్ని ఏంవీవీ సత్యనారాయణ, కోన వెంకట్ కలిసి డైరెక్టర్ శివ తుర్లపాటికి అందించారు. ఈ సందర్భంలోనే ఈ సినిమాకు చెందిన పోస్టర్ని కూడా విడుదల చేశారు. ప్రతీకారజ్వాలతో రగిలిపోతూ గీతాంజలి మళ్లీ వచ్చేస్తోందని, వెన్నులో వణుకు తెప్పించే హారర్ థ్రిల్లర్గా ఈ సినిమా రూపొందనుందని నిర్మాతలు చెప్పారు. కథానాయిక అంజలి 50వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మాటలు: భాను భోగవరపు, నందు శవరిగణ, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, కెమెరా: సుజాత సిద్ధార్థ్, ఎడిటర్: చోటా కె.ప్రసాద్, నిర్మాణం: ఏంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్.