Karuna Kumar | మూడేళ్ల కిందట వచ్చిన పలాస మూవీ క్రిటిక్స్ నుంచి గొప్ప ప్రశంసలు దక్కించుకుంది. కమర్షియల్గా పెద్దగా సక్సెస్ కాకపోయినా.. దర్శకుడు కరుణ కుమార్ టేకింగ్కు యావత్ టాలీవుడ్ ఇండస్ట్రీ మెచ్చుకుంది. యాక్షన్ సీన్స్ను రియలిస్టిక్గా చూపించిన విధానం అందరినీ ఫిదా చేసింది. కాగా ఇప్పుడదే దర్శకుడితో మెగా ప్రిన్స్ సినిమా చేయబోతున్నట్లు వస్తున్న వార్త అందరిలో ఉత్కంఠ రేపుతుంది. గద్దల కొండ గణేష్తో వరుణ్ మాస్ అప్పియరెన్స్ ఏ రేంజ్లో ఉంటుందో ఆల్రెడీ చూశాము. ఇక ఇప్పుడు కరుణ కుమార్ గనుక రా, రియలిస్టిక్ కథతో మాత్రం వస్తే వరుణ్ కెరీర్లో బెంచ్ మార్క్ అయ్యే సినిమా ఇదే అవుతుంది.
అయితే అదే కరుణ కుమార్ సుధీర్బాబుకు శ్రీదేవి సోడా సెంటర్తో మర్చిపోలేని డిజాస్టర్ ఇచ్చాడు. కథ పరంగా ఎలాంటి కంప్లయింట్స్ లేకున్నా.. కథనంలో మాత్రం బోలెడు పొరపాట్లు కనిపించాయి. కథనాన్ని టైట్గా రాసుకుని ఇంకాస్త రియలిస్టిక్గా తెరకెక్కుంచుంటే బ్లాక్ బస్టర్ సినిమా అయ్యేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇక ఈ సినిమా తర్వాత కరుణ కుమార్ మరో సినిమా చేయలేదు. కాగా ఇటివలే వరుణ్ను కలిసి ఓ కథను వినిపించాడట. వరుణ్కు ఆయన చెప్పిన లైన్ బాగా నచ్చిందట. దాంతో సింగిల్ సిట్టింగ్లోనే కథ మొత్తం వినేసి ఓకే కూడా చెప్పాడట.
నిజానికి వరుణ్ కథల ఎంపిక చాలా భిన్నంగా ఉంటుంది. అందరిలా ఓ మూస ధోరణిలో వెళ్లకుండా ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో ప్రేక్షకులను మెప్పిస్తుంటాడు. అంతేకాకుండా ఇండస్ట్రీలోను వరుణ్కు కథలపై చాలా పట్టు ఉందని అంటుంటారు. ఈ లెక్కన చూసుకుంటే కరుణ కుమార్ చెప్పిన కథ కూడా వేరే లెవల్లో ఉండబోతుందని తెలుస్తుంది. ఎగ్జిక్యూషన్లో ఎలాంటి లోపాలు లేకపోతే మాత్రం వరుణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టు కావడం ఖాయం అనిపిస్తుంది. అయితే ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
ప్రస్తుతం మెగా ప్రిన్స్ గాంఢీవధారి అర్జున సినిమాతో బిజీగా గడుపుతున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ప్రీ టీజర్ వీర లెవల్లో అంచనాలు క్రియేట్ చేసింది. దీనితో పాటుగా కొత్త దర్శకుడితో ఏయిర్ ఫోర్స్ నేపథ్యంలో ఓ సినిమా చేయబోతున్నాడు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాజీ మిస్ ఇండియా మనూషి చిల్లర్ హీరోయిన్గా నటిస్తుంది.