Saipallavi | గ్లామర్ పాత్రలకే హీరోయిన్లు మక్కువ చూపుతున్న ఈ తరంలో సాయి పల్లవి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా నటన ప్రాధాన్యమున్న పాత్రలనే ఎంచుకుంటూ వస్తుంది. అవకాశాలు రాకపోయినా పర్వాలేదు కానీ, గ్లామర్ పాత్రలను మాత్రం చేయనంటే చేయనని నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. ‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ మలయాళ కుట్టి.. మొదటి సినిమాతోనే అందరిని దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఆ తర్వాత వరుసగా తెలుగు సినిమాల్లో నటిస్తూ పక్కింటి అమ్మాయిలా ప్రేక్షకులకు దగ్గరయింది. తన నటన, డ్యాన్స్ లతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.
అయితే సాయి పల్లవి కేవలం నటన ప్రాధాన్యమున్న పాత్రలు మాత్రమే చేసుకుంటూ పోవడం వల్ల అవకాశాలు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. ఎందుకంటే అలాంటి పాత్రలు ఉన్న కథలు చాలా తక్కువగా తయారవుతూ ఉంటాయి. దాంతో ఈ అమ్మడుకి అవకాశాల కొరత ఏర్పడుతుంది. ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో ఒక్క తమిళ సినిమా తప్పితే మరోటి లేదు. ఇక గతేడాది ఈ బ్యూటీ నుండి విరాటపర్వం, గార్గి వంటి రెండు సినిమాలు రాగా అవి రెండు కమర్షియల్ గా భారీ ఫేయిల్యూర్లుగా మిగిలాయి. ఇవన్నీ పక్కన పెడితే సాయి పల్లవి ఇప్పుడు మరో రిస్క్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఒక సినిమా కోసం ఏకంగా రెండేళ్లు డేట్స్ ఇవ్వడానికి సిద్ధమైందని తెలుస్తుంది.
టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్.. ఎప్పటినుంచో రామయణం తెరకెక్కించే ప్లాన్లో ఉన్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. పాన్ ఇండియా రేంజ్లో ఈసినిమా తెరకెక్కుతుంది. తెలుగు నుంచే కాకుండా వివిధ భాషల నుంచి అగ్ర నటీనటులను ఈ సినిమా కోసం ఎంపిక చేస్తున్నారట. కాగా ఇందులో సీత పాత్ర కోసం సాయిపల్లవిని సంప్రదించగా.. తను వెంటనే ఓకే చెప్పిందట. అంతేకాకుండా ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్లు డేట్స్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది.
నిజానికి హీరోయిన్లు ఎక్స్ప్రెస్ బండిలా ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేస్తేనే ప్రేక్షకులు గుర్తుపెట్టుకుంటారు. అలాంటిది రెండేళ్ల వరకు ఒకే సినిమాకు కమిటవడమంటే సాయి పల్లవి పెద్ద రిస్క్ చేస్తుందని పలువురు నెటీజన్లు అభిప్రాయపడతున్నారు. అయితే ఇందులో నిజమెంతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజుల వరకు వేచి చూడాల్సిందే.