Rashmika Mandanna | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా గురించి ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రష్మిక చర్మ సంబంధ వ్యాధితో బాధపడుతుందని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్టే ఈ వార్తలకు కారణం అని తెలుస్తోంది.
రష్మిక మందన్నా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. తను చేసే పనులను ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తూ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే సోమవారం (06-02-2023 ) కూడా తన షెడ్యూల్ను ఇన్స్టాలో స్టోరీగా పెట్టింది. అందులో డియర్ డైరీ.. ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్గా గడిచింది. నిద్రలేచిన తర్వాత కాసేపు కార్డియో ఎక్సర్సైజ్ చేశా. భోజనం చేశాక రేపటి షెడ్యూల్ కోసం బ్యాగ్ సర్దుకున్నా. కానీ ఎప్పటిలాగే వాతావరణం, మంచు నా ప్రతి పనిని ఆపేశాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నాయి. బ్యాగు సర్దుకోవడం అయ్యాక డిన్నర్ చేశా. ఇవాళ డెర్మట్ను కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నా. చాలా ముఖ్యమైన మీటింగ్ ఉంది. కానీ అది క్యాన్సిల్ ఇచ్చింది. అందుకే ఇంటికి వచ్చేశా. ఇక గుడ్ నైట్ ‘ అని రాసుకొచ్చింది. ఐ లవ్యూ ఆల్.. స్లీప్ వెల్ అంటూ హార్ట్ ఎమోజీలను జోడించింది. ఇక్కడే రష్మిక చర్మ సమస్యలతో బాధపడుతున్నట్లు నెటిజన్లకు సందేహం వచ్చింది.
రష్మిక తన ఇన్స్టా స్టోరీలో డెర్మట్ అపాయింట్మెంట్ తీసుకున్నా అని రాసుకొచ్చింది. డెర్మట్ అంటే డెర్మటాలజిస్ట్ అని తెలుస్తోంది. దీంతో అసలు రష్మికకు ఏమైంది? ఎలాంటి చర్మ సమస్యలు వచ్చాయి? డెర్మటాలజిస్ట్ను కలిసే అంత సీరియస్ ఉందా? అంటూ నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై రష్మిక ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి.