దక్షిణాది అగ్ర కథానాయికలలో పూజా హెగ్డే ఒకరు. మోడల్గా కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు ‘ఒక లైలా కోసం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత వరుసగా బన్నీ, తారక్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో జత కట్టడంతో సౌత్లో ఈమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం ఈమె సౌత్లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటుంది. ఇక బాలీవుడ్లోనూ వరుస ప్రాజెక్ట్లతో బిజీ బిజీగా గడుపుతుంది. ప్రస్తుతం పూజా తెలుగులో మహేష్తో కలిసి ‘SSMB28’లో నటిస్తుంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుని సెకండ్ షెడ్యూల్కు సిద్ధమవుతుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్పుడు పూజాహెగ్డే వల్లే ఆలస్యమవుతున్నట్లు తెలుస్తుంది. నిజానికి ఈ సినిమా ముహూర్తం ఫిబ్రవరిలోనే జరిగింది. రెగ్యులర్ షూటింగ్ కూడా ఈ ఏడాది ప్రథమార్థంలోనే మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ మహేష్ స్క్రిప్ట్లో కొన్ని చేంజెస్ చెప్పడంతో త్రివిక్రమ్ మరోసారి తన కలానికి పని చెప్పాడు. కాగా సెప్టెంబర్ రెండో వారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తయింది. అయితే సెకండ్ షెడ్యూల్ ప్లాన్ చేసే లోపే మహేష్ తల్లి ఇందిరా దేవి, తండ్రి సూపర్ స్టార్ కృష్ణ రెండు నెలల గ్యాప్లోనే మరణించడంతో షూటింగ్ ఆగిపోయింది.
ఈ సినిమా కోసం పూజాహెగ్డే ముందుగానే డేట్స్ ఇచ్చేసిందట. కాగా ఈ ప్రాజెక్ట్ లేట్ అవడంతో ఈ సినిమా డేట్స్ను మరో సినిమాకు ఇచ్చిందట. అయితే ఇప్పుడు సడ్డెన్గా షూటింగ్ మొదలు కానుండటంతో డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతుందట. దానీ వల్లే ఈ ప్రాజెక్ట్ మరింత లేట్ అయ్యేలా ఉందని సమాచారం. ప్రస్తుతం చిత్రయూనిట్ మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం దుబాయ్ వెళ్లింది. అక్కడి నుండి తిరిగి వచ్చాక షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ లోపు పూజా కూడా తన డేట్స్ను పక్కాగా ప్లాన్ చేసుకోవాలని అనుకుంటుందట.