Director Srinu Vaitla | పాతికేళ్ల క్రితం ‘నీకోసం’ అనే సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు శ్రీనువైట్ల. తొలి సినిమానే బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని విజయం సాధించింది. ఆ తర్వాత ఆనందం, సంతోషం అంటూ బ్యాక్ టు బ్యాక్ హిట్లతో టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయాడు. ఇక వెంకీతో శ్రీనువైట్ల రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ల లిస్ట్లో చేరిపోయాడు. ఆ తర్వాత ఏకంగా చిరుతో అందరివాడు సినిమా చాన్స్ కొట్టేశాడు. ఈ సినిమా ఫలితం తేడా కొట్టినా.. ఇప్పటికే కొంతమంది చిరు ఫ్యాన్స్కు ఇది ఫేవరేట్ సినిమా. ఆ తర్వాత మళ్లీ ఢీ, దుబాయ్ శీను, రెడి వంటి హాట్రిక్ హిట్స్తో తిరిగి ఫుల్ ఫామ్లోకి వచ్చాడు. ఇక దూకుడుతో ఏకంగా వంద కోట్ల బొమ్మ సాధించి రికార్డు సృష్టించింది.
ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో సూపర్ ఫామ్లో ఉన్న శ్రీనువైట్ల ఒక్కసారిగా డౌన్ అయిపోయాడు. ఎంతలా అంటే దాదాపు ఐదేళ్లుగా ఒక్క సినిమా కూడా చేయనంతగా. బాద్షా తర్వాత శ్రీనువైట్ల బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లతో కిందికి పడిపోయాడు. ఆయనతో సినిమా చేయడానికి ఏ ఒక్క హీరో కూడా ముందుకు రావడం లేదు. గతేడాది ఢీ సీక్వెల్ను అనౌన్స్ చేసినా.. కొబ్బరికాయ కొట్టకముందే ఆగిపోయింది. మళ్లీ ఆయన సినిమాలకు సంబంధించిన వార్తలు ఇప్పటివరకు రాలేదు. కాగా తాజాగా ఆయనకు ఓ టాలీవుడ్ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇంతకీ ఎవరా హీరో అనుకుంటున్నారా? ఆయన మరెవరో కాదు బెల్లంకొండ శ్రీనివాస్.
ప్రస్తుతం బెల్లంకొండ ఛత్రపతి హిందీ రీమేక్తో బిజీగా ఉన్నాడు. వి.వి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సమ్మర్ కానుకగా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇటీవల రిలీజైన టీజర్ నార్త్ ఆడియెన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత బెల్లంకొండ, సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ యాక్షన్ సినిమా చేయబోతున్నాడు. కాగా ఇది షూటింగ్ దశలో ఉండగానే.. తాజాగా శ్రీనువైట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఇటీవలే శ్రీనువైట్ల.. బెల్లంకొండ శ్రీనును కలిసి ఓ కథ వినిపించాడట. కథ నచ్చడంతో బెల్లంకొండ శ్రీను కూడా వెంటనే ఒకే అనేశాడట. ఇక ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే బెల్లంకొండ శ్రీను అయినా.. శ్రీనువైట్ల ఫ్లాపులకు బ్రేక్ వేస్తాడో? లేదో? చూడాలి.