Allu Arjun Next Movie | ‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా బాలీవుడ్లో అల్లు అర్జున్కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ నేపథ్యంలో బన్నీ ‘పుష్ప-2’ పై మరింత ఫోకస్ పెట్టాడు. షూటింగ్ లేటైనా పర్వాలేదు గానీ.. అవుట్ పుట్ మాత్రం అస్సలు తగ్గేదేలే అన్నట్లు ఉండాలని అనుకుంటున్నాడు. ఇటీవలే పుష్ప సీక్వెల్ షూటింగ్ ప్రారంభమైంది. మైత్రీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక మందన్నా నటిస్తుంది. ఇదిలా ఉంటే పుష్ప తర్వాత అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా ఎంటనేది ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు.
మొన్నటి వరకు బన్నీ, కొరటాలకు ఓకే చెప్పినట్లు వార్తలు వచ్చాయి. కానీ ‘ఆచార్య’ ఫలితంతో బన్నీ వెనుకడుగు వేసినట్లు తెలుస్తుంది. పైగా కొరటాల ప్రస్తుతం ఎన్టీఆర్తో సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ తెరకెక్కనుండటంతో కొరటాల దీనిపైనే ఫుల్ ఫోకస్ పెట్టాడట. అంతేకాకుండా ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్తో కూడా చాలా పనుందట. దాంతో ఈ సినిమా పూర్తి కావడానికి ఏడాదిన్నర సమయం పట్టేటట్లు ఉంది. ఇక ఆ మధ్య ప్రశాంత్ నీల్ పేరు కూడా వినిపించింది. కానీ దీనిపై కూడా ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే తాజాగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి పేరు టాలీవుడ్లో చక్కర్లు కొడుతుంది.
‘రేసుగుర్రం’ వంటి బ్లాక్బస్టర్ చిత్రాన్నిచ్చిన సురేందర్ రెడ్డితోనే బన్నీ తన తదుపరి సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే బన్నీ, సురేందర్ రెడ్డిని కలిసి ఓ కథ రెడీ చేయమని చెప్పినట్లు తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం సురేందర్ రెడ్డి అఖిల్తో ఏజెంట్ తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది మహాశివరాత్రి కానుకగా రిలీజ్ కానుంది.