విశ్వ కార్తికేయ, శరణ్, అవంతిక, అర్చన గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ఐపీఎల్’. బీరం వరలక్ష్మి సమర్పణలో అంకిత మీడియా హౌస్ పతాకంపై బీరం శ్రీనివాస్ నిర్మించారు. సురేష్ లంకలపల్లి దర్శకుడు. ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు సురేష్ లంకలపల్లి మాట్లాడుతూ..‘మా అమ్మ వల్ల నాకు ఈ అవకాశం వచ్చింది. క్రికెట్ను తీవ్రవాదాన్ని ముడిపెట్టి ఈ చిత్రాన్ని రూపొందించాం.
మంచి సందేశంతో పాటు ప్రేక్షకులకు నచ్చే అంశాలుంటాయి.’ అన్నారు. హీరో విశ్వ కార్తికేయ మాట్లాడుతూ…‘ఒక మూవీ పూర్తి చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆ చిత్రాన్ని రెండు వందల థియేటర్స్లో విడుదల చేయడం మరో విశేషం. మా చిత్రానికి సంగీతం బాగా కుదిరింది. నిజాయితీగా ఒక ప్రయత్నం చేశాం’ అన్నారు. తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, పృథ్వీ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : ఏకే ఆనంద్, సంగీతం : వెంగి.