దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించే సినిమాలు ఎంత క్రియేటివ్గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అ!, కల్కి,జాంబీ రెడ్డి చిత్రాలు వేటికవి ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఈ మూడు చిత్రాలు విభిన్నమైన జానర్స్లో తెరకెక్కి మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు హను-మాన్ అంటూ తొలి తెలుగు సూపర్ హీరో సిరీస్ తెరకెక్కిస్తున్నారు.
భారతీయ పురాణేతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఈ సినిమాను రూపొందస్తున్నట్టు తెలుస్తుండగా, ఇందులో జాంబి రెడ్డి కథానాయకుడు తేజ సజ్జా హీరోగా నటిస్తున్నాడు. తొలుత ఈ చిత్రంలో మెగా హీరో సాయి తేజ్ నటిస్తారని ప్రచారమైనా.. తేజ సజ్జాని ఫైనల్ చేయడం ఆసక్తిని రేకెత్తించింది. తాజాగా హనుమంతు పాత్రను పరిచయం చేస్తున్నామని చిత్రబృందం ప్రకటించింది.
అంజనాద్రి ప్రపంచంలోకి ప్రయాణం.. హను-మాన్ నుంచి హనుమంతును పరిచయం చేస్తున్నామని వెల్లడించారు . శనివారం (18సెప్టెంబర్) ఉదయం 10.08 నిమిషాలకు ఈ లుక్ ని విడుదల చేస్తామని తెలిపారు. బహుశా ఇది ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కావచ్చు అన్నది ఆసక్తిగా మారింది. ఈ సినిమా పరంగా మాత్రం టాలీవుడ్ ఆడియెన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు. నిరవ్ రెడ్డి-చైతన్య నిరవ్ తదితరులు ఈ చిత్రంతో అసోసియేట్ అయ్యారు