Cinema News | యానీయా భరద్వాజ్, కబీర్ దుహాన్సింగ్ ప్రధానపాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘ఇంద్రాణి’. స్టెఫన్ పల్లం దర్శకుడు. స్టాన్లీ సుమన్బాబు నిర్మాత. ఈ మూవీ ట్రైలర్ను హైదరాబాద్లో విడుదల చేశారు. అగ్ర సంగీత దర్శకుడు మణిశర్మ, నిర్మాత అనిల్సుంకర ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేశారు. చిత్ర యూనిట్కి శుభాకాంక్షలు అందించారు. ‘కథపై నమ్మకంతో ఈ సినిమా నిర్మించాం. వీఎఫ్ఎక్స్ వర్క్ కోసం ఏడాది కష్టపడ్డాం. ఈ సినిమా ైక్లెమాక్స్ ఊహలకు అందని స్థాయిలో ఉంటుంది. సాంకేతికంగా అన్ని విధాలుగా సినిమా బావుంటుంది.
ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం దర్శకుడే’ అని నిర్మాత అన్నారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఇదని, రెండుగంటల నలభై నిమిషాల పాటు విజువల్ వండర్ చూసిన అనుభూతికి ప్రేక్షకులు లోనవుతారని, టైమ్ మిషిన్, రోబో ఇందులో కీలకంగా ఉంటాయని, రాబోవు యాభైఏళ్లల్లో ఇండియా ఎంత అడ్వాన్స్గా ఉండబోతుందో ఇందులో చూస్తారని దర్శకుడు తెలిపారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యలందరూ మాట్లాడారు. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది.