ఈవీ గణేష్బాబు స్వీయదర్శకత్వం వహించి నటించిన చిత్రం ‘కట్టిల్’. సృష్టి డాంగే కథానాయిక. ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో ‘పందిరి మంచం’ పేరుతో విడుదల కాబోతుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘పలు ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్లో ప్రదర్శింపబడిన చిత్రం ఇది. తరతరాలుగా ఒకే ఇంట్లో వున్న పందిరి మంచం కథతో సాగుతుంది. ఇక వంశంలోని మూడు తరాల పరంపర గురించి అందర్నీ ఆకట్టుకునే కథతో రూపొందించాం.
తాజాగా ఈ చిత్రంలో సిద్శ్రీరామ్ ఆలపించిన కోవెలలో అనే లిరికల్ సాంగ్ను విడుదల చేశాం. ఈ పాటకు మంచి స్పందన వస్తున్నది.’ అన్నారు.