ప్రియదర్శి (Priyadarshi), కావ్యా కళ్యాణ్ రామ్ (Kavya Kalyanram) లీడ్ రోల్స్ లో నటిస్తున్న చిత్రం ‘బలగం’ (Balagam). సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. వేణు ఎల్దండి (కమెడియన్) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చి 3న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ సిరిసిల్లలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈవెంట్కు మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నిర్మాత దిల్రాజుతోపాటు చిత్రయూనిట్ సభ్యులు ఈవెంట్లో పాల్గొన్నారు.
ఈవెంట్లో హీరోయిన్ కావ్యా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ..సిరిసిల్లకు వస్తే మా అమ్మమ్మ వాళ్ల ఊరికొచ్చినట్టనిపిస్తది. మేమంతా ఇక్కడ షూటింగ్ చేసినన్ని రోజులు మీరిచ్చిన ప్రేమే కారణం. నేను తెలంగాణలో కొత్తగూడెం ప్రాంతంలో పుట్టాను. కానీ ఫ్యామిలీ అంతా హైదరాబాద్లో సెటిల్ అవడం వల్ల ఎప్పుడూ తెలంగాణ ఊళ్లల్లోకి వెళ్లే అవకాశం దక్కలేదు. సిరిసిల్ల నుంచి లోపలికి ఊళ్లల్లకు వెళ్లి 50 రోజులపాటు షూటింగ్ అంటే ఎట్లుంటదో అనే భయం ఉండేది. కానీ ఇక్కడికి రాగానే గ్రామాల్లో ఉన్న రోడ్లు, సౌకర్యాలు చాలా అద్భుతంగా అనిపించాయి. అలాంటి సౌకర్యాలు అందించిన మంత్రి కేటీఆర్ సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నానంది.
నేను ఇతర రాష్ట్రాలకెళ్లినపుడు మా తెలంగాణ ఊర్లలో రోడ్లు ఎంత బాగుంటయి తెలుసా..? అని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. తెలంగాణలో నేనెక్కడైతే పుట్టానో ఆ ప్రాంతానికి నన్ను పరిచయం చేస్తారనుకుంటే..? వేణు తీసిన సినిమా ద్వారా తెలంగాణ సంస్కృతిని నాకెంత నేర్పించారో.. అందరూ కూడా సినిమాలో అదే చూస్తారని ఆశిస్తున్నానని చెప్పుకొచ్చింది. ఇలాంటి సినిమాలో నాకు ఒక పాత్ర ఇచ్చినందుకు వేణు సార్కు చాలా ధన్యవాదాలు. మార్చి 3న మీరంతా సినిమా చూస్తారని నేననుకుంటున్నానని చెప్పుకొచ్చింది.
బలగం ట్రైలర్..