జబర్ధస్త్ షోతో ఫుల్ క్రేజ్ తెచ్చుకొని ఇప్పుడు సినిమాలలోను తనదైన నటనతో దూసుకుపోతున్నాడు హైపర్ ఆది. ప్రస్తుతం మనోడు జబర్దస్త్ తో పాటుగా శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోలలో కనిపిస్తూ అలరిస్తున్నాడు. అయితే పలు వివాదాస్పద కామెంట్స్తో వార్తలలో నిలుస్తూ ఉండే ఆదిపై దాడికి దిగారని సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా పలు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన స్పందించారు.
నాపై దాడి చేయడం కోసం ఎవరో వెతుకుతున్నారంటూ ఏవేవో ఫేక్ న్యూస్లు వస్తున్నాయి. మీ ఫేక్ న్యూస్లు రాసేవారికి ఒకటే చెప్తున్నా.. మీ దగ్గర డబ్బుల్లేవంటే చెప్పండి, నేను సంపాదించే దాంట్లో కొంత తీసి మీకిస్తాను. మేమందరం హ్యాపీగా షూటింగులు చేసుకుంటున్నాం. అందరూ హ్యాపీగా ఉండండి, మేమూ హ్యాపీగా ఉన్నాం అని చెప్పుకొచ్చాడు హైపర్ ఆది. మరి దీంతో అయిన పుకార్లకి బ్రేక్ పడ్డట్టేనా అన్నది చూడాలి.
దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో హైపర్ ఆది, ఆటో రాం ప్రసాద్ కలిసి స్కిట్ చేశారు. అందులో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు గురించి మాట్లాడారు. అలాగే మంచు విష్ణు బాడీ లాంగ్వేజ్ను ఇమిటేట్ చేసినట్లు క్లియర్గా అర్థమైంది. దీంతో ఆగ్రహించిన మంచు విష్ణు అభిమానులు హైపర్ ఆదిపై ఫైర్ అయ్యారని, క్షమాపణలు చెప్పాలని కోరితే, దానికి హైపర్ ఆది నిరాకరించడంతో ఆయనపై దాడి చేశారంటూ సోషల్ మీడియాలో వార్తలు షికారు చేసాయి.
https://www.instagram.com/tv/CWDh1-zJN7g/?utm_source=ig_web_copy_link