Prabhas- Maruthi movie | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో ఐదు సినిమాలున్నాయి. ఇప్పటికే ఈయన నటించిన ‘రాధేశ్యామ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషన్లను జోరుగా జరుపుతుంది. ఇదిలా ఉంటే ప్రభాస్-మారుతి కాంబోలో తెరకెక్కునున్న సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రభాస్, మారుతి దర్శకత్వంలో ఓ కామెడీ హర్రర్ సినిమాను చేయబోతున్నట్లు గత కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది.లేటెస్ట్గా ప్రభాస్ కూడా రాధేశ్యామ్ ప్రమోషన్లో ‘ప్రతి రెండు మూడు సినిమాల తర్వాత కొత్తగా ఏదైనా చేయాలనిపిస్తుంది. ఈ క్రమంలోనే త్వరలో ఓ కామెడి సినిమాను చేయబోతున్నాను’ అంటూ ఈ చిత్రంపై క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ చిత్రాన్ని మారుతి తొందరగా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. దానికోసం హైదరాబాద్లో అల్యూమీనియం ప్యాక్టరీలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ భారీ సెట్ను రూపొందిస్తున్నారట మేకర్స్. చాలా వరకు ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఈ సెట్లోనే జరుగనుందట. ఈ చిత్రం కోసం ప్రభాస్ కూడా తక్కవ కాల్షీట్లే ఇచ్చాడని టాక్. ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలకు స్థానం ఉందట. అందులో రాశీఖన్నా, మాళవిక మోహన్ ఇద్దరు హీరోయిన్లుగా ఎంపికయినట్లు సమాచారం. ‘సలార్’, ‘ప్రాజెక్ట్-K’ చిత్రాలతో పాటుగా ఈ చిత్రం ఏకకాలంలో రూపొందనుంది. ఏప్రిల్ నుంచి ఈ చిత్రం ప్రారంభంకానున్నట్లు తెలుస్తుంది.
ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి12న విడుదల కానున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. ‘సలార్’ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దీంతో పాటుగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ చిత్రం ‘ప్రాజెక్ట్-K’ ఇప్పటికే షూటింగ్ను ప్రారంభించింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉంది.