కొవిడ్ టైమ్లో సినిమాల షూటింగ్లన్నీ బంద్ అయ్యాయి. అప్పుడు తీసుకున్న విరామానికి ఇప్పుడు వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రతీకారం తీర్చుకుంటున్నానని చెప్పింది హిందీ నాయిక భూమి ఫెడ్నేకర్. గత రెండేళ్లు కావాల్సినంత సమయం దొరికిందని, అయితే ఇప్పుడు క్షణం తీరిక ఉండటం లేదని ఆమె అంటున్నది.
భూమి ఫెడ్నేకర్ మాట్లాడుతూ…‘బదాయిదో’ సినిమా విజయంతో ఈ సంవత్సరాన్ని ఉత్సాహంగా ప్రారంభించా. ప్రస్తుతం ‘లేడీ కిల్లర్’, ‘భక్షక్’ చిత్రాల షూటింగ్స్ కంప్లీట్ చేశాను. నవాజుద్దీన్ సిద్ధిఖీతో కలిసి ‘అఫా’ అనే చిత్రంలో నటిస్తున్నాను మరో రెండు కొత్త ప్రాజెక్ట్స్ సెట్స్ మీదకు తీసుకెళ్తున్నా. అయితే మనకంటూ కొంత సమయం ఉండాలన్నది నా అభిప్రాయం.
పాండమిక్లో ఇది కావాల్సినంత దొరికింది. ఇప్పుడేమో తీరిక లేదు. కొవిడ్ టైమ్లో దొరికిన విశ్రాంతిపై ఇప్పుడు పగ తీర్చుకుంటున్నా. అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పుడు విరామం తీసుకోకూడదు. ఈ ఉత్సాహం ఉన్నంతకాలం కాదనకుండా పనిచేస్తూనే ఉంటా’ అని చెప్పింది. భూమి నటించిన ‘రక్షా బంధన్’ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.