Anirudh Ravichander | కోలీవుడ్ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్కు మద్రాస్ హైకోర్ట్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. అనిరుధ్ ‘హుకుమ్’ పేరుతో ప్రపంచవ్యాప్తంగా మ్యూజికల్ కన్సర్ట్లు నిర్వహించబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆగస్టు 23న చెన్నైలోని కువత్తూర్ సమీపంలో ఉన్న స్వర్ణభూమి రిసార్ట్స్లో ఒక భారీ కన్సర్ట్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే బుకింగ్స్ కూడా స్టార్ట్ అవ్వగా.. భారీ స్థాయిలో దీనికి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ కన్సర్ట్ నిర్వాహకులు కలెక్టర్ అనుమతి పొందలేదని.. అలాగే వేడుకకు వచ్చే ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేదని పేర్కొంటూ చెయ్యూర్ నియోజకవర్గ శాసనసభ్యుడు పనైయూర్ బాబు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఆనంద్ వెంకటేష్, కొన్ని ముఖ్య సూచనలు చేస్తూ ఈ సంగీత కచేరీ నిర్వహణకు అనుమతినిచ్చారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే మహాబలిపురం డీఎస్పీ నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక కోర్టు ఇచ్చిన తీర్పుతో అనిరుధ్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.
What a tour it was and the most perfect way to end it – this evening, at home in Chennai ! Thank you all for the craziness! The #HukumTour ❤️
Let’s go crazy – https://t.co/CiF0CnJaB0
📹 @GndShyam ⚡️ pic.twitter.com/nnSvkQ71ZS
— Anirudh Ravichander (@anirudhofficial) August 23, 2025