అభినవ్ గోమఠం, వైశాలిరాజ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా’. తిరుపతి రావు ఇండ్ల దర్శకుడు. కాసుల క్రియేటివ్ వర్క్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదలకానుంది. మంగళవారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. యువ హీరో వరుణ్తేజ్ ముఖ్య అతిథిగా హాజరై బిగ్ టికెట్ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కమెడియన్గా అభినవ్ తనకంటూ ప్రత్యేకతను సృష్టించుకున్నాడు. చక్కటి కంటెంట్తో ఈ సినిమా చేశారు’ అన్నారు. ఈ సినిమా తన కెరీర్లో ఎంతో ప్రత్యేకమైనదని, ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని పూర్తిచేశామని, కథలోని కొత్తదనం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని అభినవ్ గోమఠం చెప్పారు. ఈ సినిమాలోని ప్రతి పాత్ర గుర్తుండిపోతుందని నిర్మాతలు ఆరెమ్ రెడ్డి, ప్రశాంత్ వి పేర్కొన్నారు.