అగ్ర హీరో రామ్చరణ్ తన మిత్రుడు విక్రమ్ రెడ్డితో కలిసి వీ మెగా పిక్చర్స్ పేరుతో ఇటీవలే నూతన నిర్మాణ సంస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్యానర్పై ‘ది ఇండియా హౌస్’ పేరుతో కొత్త చిత్రాన్ని ప్రకటించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్తో కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు .
నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ్ఖేర్ ప్రధాన పాత్రల్లో నటించబోతున్న ఈ చిత్రం ద్వారా రామ్ వంశీకృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ‘స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన సంఘటనల నేపథ్య కథాంశమిది. అప్పటి రాజకీయ సంక్షోభ సమయంలో నడిచే ప్రేమకథగా ఆకట్టుకుంటుంది’ అని చిత్రబృందం పేర్కొంది.