నిఖిల్ కథానాయకుడిగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కార్తికేయ-2’. టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. జూలై 22న విడుదల కానుంది. సోమవారం కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ‘ శ్రీకృష్ణుడు నేపథ్యంలో నడిచే కథ ఇది. ఓ చారిత్రక సత్యం గురించి అన్వేషించే డాక్టర్ కార్తికేయగా నిఖిల్ కనిపిస్తాడు. ద్వాపర యుగంలో ఏం జరిగిందన్నది ఆద్యంతం ఆసక్తిని పంచుతుంది’ అని చిత్రబృందం తెలిపింది. అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ఖేర్, శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్, ఆదిత్యామీనన్, తులసి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: చందు మొండేటి.