Pushpa The Rule | టాలీవుడ్లో రాబోతున్న మోస్ట్ అవెయిటెడ్ సినిమాల్లో ఒకటి పుష్ప.. ది రూల్ (Pushpa The Rule). సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన పుష్ప.. ది రైజ్కు సీక్వెల్గా వస్తున్న ఈ మూవీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పుష్పరాజ్గా మరోసారి ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాను ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించేశారు మేకర్స్.
అయితే ఈ చిత్రం మరో తేదీన విడుదల కాబోతుందంటూ వార్తలు ఊపందుకున్నాయి. ఇవన్నీ వట్టి పుకార్లేనని చిత్రయూనిట్ కొట్టిపారేసింది. సుకుమార్ డైరెక్టోరియల్ వెంచర్ అనుకున్న సమయానికి స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తాజా సమాచారం. మరోవైపు ఇదే రోజు బాలీవుడ్ యాక్టర్లు అజయ్ దేవ్గన్, రన్వీర్ సింగ్, అక్షయ్ కుమార్, దీపికాపదుకొనే, కరీనా కపూర్, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్ ప్రధాన పాత్రల్లో రోహిత్ శెట్టి డైరెక్ట్ చేస్తున్న Singham Again గ్రాండ్గా థియేటర్లలో విడుదల కానుంది.
మరి ఈ వార్తల నేపథ్యంలో పుష్ప.. ది రూల్ సోలోగానే విడుదలవుతుందా..? Singham Again విడుదల తేదీని మేకర్స్ ఏమైనా మారుస్తారా..? లేదంటే పుష్ప.. ది రూల్తో పోటీలోకి దించుతారా..? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదలైతే మాత్రం రెవెన్యూపై భారీ ప్రభావం చూపే అవకాశాలున్నాయని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పుష్ప.. ది రూల్ కోసం రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ నుంచి ఫస్ట్ పార్టును మించిపోయే మరో చార్ట్ బస్టర్ ఆల్బమ్ రాబోతుందని ఇన్సైడ్ టాక్.ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తోంది. ఫస్ట్ పార్టులో శ్రీవల్లిగా నటించిన కన్నడ సోయగం రష్మిక మందన్నా సీక్వెల్లో మరోసారి ఫీ మేల్ లీడ్ రోల్లో కనిపించనుంది.
పుష్పరాజ్ ఎక్కడ..?