‘నటిగా నాకు ఎలాంటి పరిమితులు లేవు. నవ్యానుభూతికి లోనుచేసే పాత్రల్లో కనిపించాలనుంది’ అని చెప్పింది అనసూయ. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘థాంక్ యూ బ్రదర్’. రమేష్ రాపర్తి దర్శకుడు. మాగుంట శరత్చంద్రారెడ్డి, తారక్నాథ్ బొమ్మిరెడ్డి నిర్మాతలు.మే 7న ‘ఆహా’ ఓటీటీ ద్వారా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.అనసూయ మాట్లాడుతూ ‘నా హృదయానికి దగ్గరైన చిత్రమిది. ‘రంగమ్మత్త’ పాత్ర మాదిరిగానే ఇందులో నేను చేసిన ప్రియ క్యారెక్టర్ గుర్తుండిపోతుంది’ అని చెప్పింది.