గురువారం హాస్యబ్రహ్మ బ్రహ్మానందం పుట్టినరోజును పురస్కరించుకొని ‘రంగమార్తాండ’ చిత్రం నుంచి ఆయన ఫస్ట్ గ్లింప్స్ను విడుదల చేశారు. రంగస్థల కళాకారుల జీవితాలు, వారి జీవన సంఘర్షణ నేపథ్యంలో దర్శకుడు కృష్ణవంశీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రకాష్రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.
ఫస్ట్గ్లింప్స్లో బ్రహ్మానందం ఆసుప్రతి మంచం మీద స్లైన్ పెట్టుకొని విషాదంగా కనిపిస్తున్నారు. కన్నీటి పర్యంతమవుతూ ఆయన చెప్పిన సంభాషణ ఉద్వేగంగా సాగింది. ‘సుయోధన సౌర్వభౌమ శరా ఘాతాలతో ఛిద్రమై..ఊపిరి ఆవిరై..దిగంతాల సరిహద్దులు చెరిగిపోతున్న వేళ…’ అంటూ గద్గద స్వరంతో బ్రహ్మానందం చెప్పిన సంభాషణ అందరిని ఆకట్టుకుంటున్నది. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్నందిస్తున్నారు.