గత ఏడాది కంటే ఈ ఏడాది కరోనా వేవ్ ఉదృతి ఎక్కువగా ఉంది. ఆక్సిజన్ అందక చాలా మంది నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ పరిస్థితులని గమనించిన సెలబ్స్ తమ వంతు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా ఫిదా ఫేం హర్షవర్ధన్ రాణే తన బైక్ని అమ్మి మరీ ఆక్సిజన్ అందిస్తానంటున్నాడు. తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో ఎంతో ప్రేమగా చూసుకుంటున్న బైక్ ఫొటోలు షేర్ చేస్తూ.. ఈ బైక్ తీసుకొని ఆక్సిజన్ ఇవ్వండని కోరుతున్నాడు.
హర్షవర్ధన్ రాణే ఆలోచనకు నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. కష్టకాలంలో మీరు చూపిస్తున్న చొరవ అద్భుతం అని కామెంట్స్ పెడుతున్నారు. కాగా, గతేడాది అక్టోబర్లో కరోనాని జయించాడు హర్ష. తకిట తకిట, నా ఇష్టం, కవచం, సనమ్ తేరీ కసమ్ అనే బాలీవుడ్ చిత్రంతో పాటు పాటు పలు వెబ్ సిరీస్లోను నటిస్తూ అలరిస్తున్నాడు హర్ష.