Jai Hanuman | టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హనుమాన్’(Hanuman). తేజ సజ్జా(Teja Sajja) కథా నాయకుడిగా నటించిన ఈ సినిమా ఇప్పటికే గ్లోబల్ లెవల్లో క్రేజ్ సంపాదించుకుంది. దేశవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు అంతటా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో భారీ ఓపెనింగ్స్ రాబడుతున్నది. దీంతో మూవీ లవర్స్ కూడా ఈ సినిమా చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఈ సినిమా ముగింపులో అభిమానులకు ఒక సాలిడ్ అప్డేట్ను ఉంచాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ.
ఈ సినిమా క్లైమాక్స్ పూర్తయిన అనంతరం.. ఎండ్ క్రెడిట్స్ వచ్చే ముందు ఓ అదిరిపోయే సర్ప్రైజ్ను ఇచ్చాడు ప్రశాంత్. ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందని వెల్లడించాడు. ఈ సినిమా మొదటి పార్ట్కు ‘హనుమాన్’ అని టైటిల్ పెట్టిన ప్రశాంత్ హనుమాన్ పార్ట్ 2కు ‘జై హనుమాన్’ (Jai Hanuman) అని టైటిల్ ఫిక్స్ చేశాడు. 2025లో జై హనుమాన్ రానుందని వెల్లడించాడు.
తేజ సజ్జా – అమృత అయ్యర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో వినయ్ రాయ్ స్టైలిష్ విలన్గా ఆకట్టుకున్నారు. వరలక్ష్మి శరత్కుమార్, సముద్రఖని వంటి నటీనటులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. నిరంజన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె.నిరంజన్రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని చైతన్య సమర్పిస్తున్నారు.