Gunturu Kaaram | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas ) కాంబోలో వచ్చిన తాజా చిత్రం ‘గుంటూరు కారం’ (Gunturu Kaaram). అతడు, ఖలేజా సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా రావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మొదటిరోజే ఈ సినిమాకు కొంచెం మిక్స్డ్ టాక్ రావడంలో కలెక్షన్ల మీద ప్రభావం పడుతుందని ట్రేడ్ వర్గాలు భావించాయి. కానీ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాలోని సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఈ సినిమా నుంచి అమ్మ ఫుల్ సాంగ్ విడుదల చేసిన చిత్రబృందం తాజాగా ధమ్ మసాలా ఫుల్ వీడియోను వదిలింది.
“ఎదురొచ్చే గాలి… ఎగరేస్తున్నా చొక్కా పై గుండీ… ఎగబడి ముందరకే వెళ్ళిపోతాది నేనెక్కిన బండి. ధమ్ మసాలా బిర్యానీ.. ఎర్ర కారం… అర కోడి, నీంబు సోడా… ఫుల్ బీడీ, గుద్ది పారేయి గుంటూరునే” అంటూ సాగిన ఈ పాట రిపీట్ మోడ్ లో వినేలా చేస్తుంది. ఇక ఈ పాటను సంజిత్ హెగ్డే & జ్యోతి నూరన్ కలిసి పాడగా లిరిక్స్ ‘సరస్వతీ పుత్ర’ రామజోగయ్య శాస్త్రి, సంగీతం థమన్ ఎస్ అందించారు.