Guntur Kaaram | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ (Trivikram) కాంబోలో వస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం (Guntur Kaaram). శ్రీలీలా, మీనాక్షి చౌదరి కథనాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన లిరికల్ సాంగ్స్ లక్షల వ్యూస్తో సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. అయితే తాజాగా ఈ చిత్రం అరుదైన రికార్డు సృష్టించబోతుంది.
ఈ సినిమా ఓవర్సీస్లో భారీ ఎత్తున విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఒక్క అమెరికాలోనే ఈ సినిమాకు సంబంధించి 5 వేలకు పైగా ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. అయితే ఈ సినిమాకు ఇన్ని షోలు ప్రదర్శించడం పట్ల ఆర్ఆర్ఆర్ సినిమాపై ఉన్న రికార్డును బద్దలు కొడుతుంది. ఇప్పటివరకు అమెరికాలో అత్యధిక ప్రీమియర్ షోలు ప్రదర్శితం అయిన సినిమాగా RRR (5408 షోలు)రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఈ రికార్డును గుంటూరు కారం 5408 షోలతో బద్దలుకొట్టబోతుంది. ఇది ఆల్ టైం రికార్డ్ అంటూ చిత్రబృందం తెలిపింది. ఇక ఈ విషయం తెలుసుకున్న మహేష్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.
మరోవైపు ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్లో భారీ ఎత్తున నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. దీనికోసం పోలీసుల దగ్గర నుంచి పర్మిషన్ కూడా తెచ్చుకున్నారు. అయితే సడన్గా ఈ ఈవెంట్కు భద్రతా సమస్యల కారణంగా పర్మిషన్ రద్దు చేసినట్లు ప్రకటించారు.