విన్ను మద్దిపాటి, స్మిరిత రాణి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘గ్రంథాలయం’. వైష్ణవి శ్రీ నిర్మిస్తున్నారు. సాయి శివన్ జంపన దర్శకుడు. త్వరలో విడుదలకానుంది. టీజర్ను తాజాగా విడుదల చేశారు. దర్శకుడు సాయి శివన్ మాట్లాడుతూ ‘యాక్షన్ థ్రిల్లర్ జానర్లో ఓ సరికొత్త ప్రయత్నం చేశాం. ఈ తరహాలో ఇలాంటి కథ రాలేదని చెప్పవచ్చు. చేవెళ్ల దగ్గర ఎక్కువ భాగం చిత్రీకరణ జరిపాం. వినూత్న సినిమాగా ఆకట్టుకుంటుంది’ అన్నారు.