Megastar Chiranjeevi | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఘనంగా సన్మానించారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక పద్మవిభూషణ్ వరించిన సందర్భంగా చిరంజీవికి రాజ్భవన్లో సన్మాన కార్యక్రమం జరిగింది. తన సతీమణి సురేఖతో కలిసి రాజ్భవన్ వచ్చిన చిరంజీవి గవర్నర్ని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం గవర్నర్ దంపతులు చిరంజీవికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.