హీరో గోపీచంద్ ప్రస్తుతం ‘భరత వర్ష’ అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామా షూటింగ్లో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన మరో సినిమాను ప్రకటించారు. దీని ద్వారా ఫైట్ మాస్టర్ వి.వెంకట్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. గోపీచంద్ 34వ సినిమా ఇది. 70ఎం.ఎం. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు.
శనివారం అనౌన్స్మెంట్ పోస్టర్ను విడుదల చేశారు. మైథలాజికల్ అంశాలతో సాగే చిత్రమిదని, భారీ బడ్జెట్తో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: షాందత్, సంగీతం: సామ్ సి ఎస్, రచన-దర్శకత్వం: వి.వెంకట్.