ముంబై: ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత నెలకొన్న సంక్షోభం, అక్కడి వారిని తరలించడానికి చేసిన ఆపరేషన్పై బాలీవుడ్లో ఓ మూవీ తెరకెక్కుతోంది. జాన్ అబ్రహం నటించిన అటాక్ సినిమా ప్రొడ్యూసర్ అజయ్ కపూర్.. గరుడ్ ( GARUD ) పేరుతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. సుభాష్ కాలెతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమా డైరెక్టర్, నటీనటుల గురించి త్వరలోనే వివరాలు వెల్లడించనున్నారు. అటాక్ మూవీ ఇంకా రిలీజ్ కాలేదు. దీనిని ఓటీటీల్లో కాకుండా థియేటర్లలోనే రిలీజ్ చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది.
అటాక్ రిలీజ్కు ముందే గరుడ్ పేరుతో తన తర్వాతి మూవీని అజయ్ కపూర్ ప్రకటించడం విశేషం. ఈ విషయాన్ని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విటర్ ద్వారా చెప్పాడు. ఆఫ్ఘన్ రెస్క్యూ సంక్షోభంపై మూవీ వస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది ఆగస్ట్ 15న రిలీజ్ కానుందని ఆదర్శ్ తెలిపాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోని ప్రత్యేక బలగాలైన గరుడ్ కమాండో ఫోర్స్లో పనిచేసే ఓ అధికారి చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
FILM ON AFGHAN RESCUE CRISIS… #AjayKapoor – currently producing #Attack [#JohnAbraham] – collaborates with #SubhashKale for #Garud… Based on #Afghan rescue crisis… Director + cast to be announced… Music by #RaviBasrur [#KGF, #KGF2]… 15 Aug 2022 release #IndependenceDay. pic.twitter.com/SQN7wJvKEj
— taran adarsh (@taran_adarsh) September 15, 2021