‘దొరసాని’ ‘మిడిల్క్లాస్ మెలోడీస్’ ‘పుష్పకవిమానం’ వంటి కథాబలమున్న చిత్రాల ద్వారా ప్రేక్షకులకు చేరువయ్యారు యువ కథానాయకుడు ఆనంద్ దేవరకొండ. తాజాగా ఆయన ‘గం..గం..గణేశా’ పేరుతో ఓ యాక్షన్ ఎంటర్టైనర్కు శ్రీకారంచుట్టారు. హై-లైఫ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఆనంద్ దేవరకొండ ఇప్పటివరకు చేయని యాక్షన్ ఇతివృత్తమిదని, ఆయన పాత్ర చిత్రణ కొత్త పంథాలో ఉంటుందని చిత్రబృందం తెలిపింది. మరిన్ని వివరాల్ని త్వరలో వెల్లడించబోతున్నారు. ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతాన్నందిస్తున్నారు.