అంజలి, ప్రియదర్శి, రావురమేష్ ప్రధాన పాత్రల్లో జీఏ2 పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న తాజా చిత్రం ఆదివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. బన్నీవాసు, విద్యా మాధురి నిర్మిస్తున్నారు. కరుణకుమార్ దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అన్విత క్లాప్నివ్వగా, అల్లు అరవింద్ కెమెరా స్విఛాన్ చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘సందేశాత్మక కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. అంజలితో పాటు మిగతా పాత్రలు వైవిధ్యంగా ఉంటాయి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఎడిటర్: నవీన్నూలి, సినిమాటోగ్రఫీ: అరుల్ విన్సెంట్.