టాలీవుడ్ యువ హీరో సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం టిల్లు 2 (Tillu Square)లో నటిస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లో డీజే టిల్లుకు సీక్వెల్గా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. నరుడా డోనరుడా ఫేం మల్లిక్రామ్ (Mallik Ram) దర్శకత్వం వహిస్తున్నాడు.
టైటిల్కు ఏ మాత్రం తగ్గకుండా డీజే టిల్లును మించిపోయేలా నైజాం ఏరియాలో సీక్వెల్కు ఫుల్ డిమాండ్ ఉందట. డీజే టిల్లు నైజాం ఏరియాలో రూ.7 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. నిర్మాతలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని టిల్లు 2 పంపిణీ హక్కులకు సంబంధించి రూ.9 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు ఫిలింనగర్లో జోరుగా చర్చ నడుస్తోంది.
అంతేకాదు చాలా పంపిణీ సంస్థలు ఈ సినిమా హక్కులను సొంతం చేసుకునేందుకు సిద్దంగా ఉన్నాయని ఇన్సైడ్ టాక్. ఈ ఒక్క అప్డేట్ సిద్దు జొన్నలగడ్డ సినిమాకు క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చెబుతోంది. రెండో పార్టులో అనుపమపరమేశ్వరన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. సూర్యదేవర నాగవంశీకి టిల్లు 2తో మరోసారి కాసుల వర్షం కురవడం ఖాయమని తాజా అప్డేట్తో అర్థమవుతుంది.