టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ (Ram Charan) ఉప్పెన ఫేం బుచ్చిబాబుతో సినిమా చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. సుకుమార్తో కూడా మరో సినిమా చేయబోతున్నాడు రాంచరణ్ . కాగా రాంచరణ్ మరోవైపు కన్నడ ఫిల్మ్ మేకర్ నర్తన్(Narthan)తో కూడా సినిమా చేస్తున్నట్టు అప్డేట్ బయటకు వచ్చింది. నర్తన్ ఇటీవలే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్తో సినిమా చేస్తున్నట్టు ప్రకటించేశాడు. శివరాజ్ కుమార్ సినిమా నేపథ్యంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్లో రాంచరణ్ చేయబోయే ప్రాజెక్ట్ ప్రస్తుతానికి అటకెక్కినట్టేనని ఊహాగానాలు ఊపందుకున్నాయి.
అయితే తాజా అప్డేట్ ప్రకారం నర్తన్ సిద్దం చేసిన ఐడియా రాంచరణ్ను ఇంప్రెస్ చేసిందని టాక్. రాంచరణ్ సినిమా మొదలయ్యే కంటే ముందే శివరాజ్కుమార్ తో చేస్తున్న సినిమాను పూర్తి చేసే పనిపై ఫోకస్ పెట్టబోతున్నాడట నర్తన్. మరోవైపు రాంచరణ్ కూడా శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ఆర్సీ 15 షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది. రాంచరణ్-నర్తన్ ప్రాజెక్ట్ వీలైనంత త్వరగా షురూ కాబోతుందని యూవీ క్రియేషన్స్ సన్నిహిత వర్గాల సమాచారం.
రాంచరణ్-నర్తన్ ప్రాజెక్ట్ నిలిచిపోయినట్టు వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని తాజా అప్డేట్ ఒకటి ఇపుడు ఫిలింనగర్ సర్కిల్లో టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచింది. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆర్సీ 15లో బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. రాజోలు సుందరి అంజలితోపాటు నవీన్ చంద్ర, సునీల్, ఎస్జే సూర్య, జయరాం, శ్రీకాంత్, నాజర్, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.