టాలీవుడ్ డ్రగ్స్ కేసు 2017 లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అప్పుడే ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురు సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. అప్పుడే సినీ ప్రముఖులను ఈడీ అధికారులు వాళ్లను విచారించి.. వాంగ్మూలాలు కూడా సేకరించారు. వాటిని కోర్టుకు కూడా సమర్పించారు.
కానీ.. ఆ కేసుకు సంబంధించి.. మనీల్యాండరింగ్ జరిగిందా? లేక ఫేమా చట్టాన్ని ఉల్లంఘించారా? అనే వివరాలు తెలుసుకోవడం కోసం.. మళ్లీ 12 మందికి ఈడీ సమన్లు జారీ చేసింది. అందులో 10 మంది సినీ ప్రముఖులు ఉన్నారు.
ముందుగా ఆగస్టు 31, 2021న డైరెక్టర్ పూరీ జగన్నాథ్ను ఈడీ అధికారులు విచారించారు. పూరీ తర్వాత చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, నవదీప్తో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురు సెలబ్రిటీలను ఈడీ అధికారులు విచారించారు.
అయితే.. నాలుగేళ్ల క్రితమే.. డ్రగ్స్ టెస్ట్ కోసం పూరీ జగన్నాథ్, నటుడు తరుణ్.. తమ రక్తం, వెంట్రుకలు, గోర్ల శాంపిల్స్ను ఈడీకి అందించారు. వీళ్లిద్దరు మినహా.. మిగతా వాళ్లు ఎవ్వరూ శాంపిల్స్ ఇవ్వలేదు. అప్పుడే వీళ్ల శాంపిల్స్లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని తేలింది.
తాజాగా.. దర్శకుడు పూరీ, తరుణ్… నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు 100 శాతం లేవని ఎఫ్ఎస్ఎల్(ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ) క్లీన్ చిట్ ఇచ్చింది. పూరీ, తరుణ్కు సంబంధించిన రక్తం, వెంట్రుకలు, గోర్లను ఎఫ్ఎస్ఎల్ పరీక్షించి.. వాటిలో డ్రగ్స్ ఆనవాళ్లు ఏమాత్రం లేవని తేల్చిచెప్పింది. పూరీ, తరుణ్ స్వచ్ఛందంగానే తమ రక్తం, గోర్లు, వెంట్రుకలు ఇచ్చారని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Tollywood Drugs Case : ఈడీ విచారణకు నటుడు తనీశ్
Drugs Case: ఈడీ విచారణకు హాజరైన ముమైత్ ఖాన్
Tollywood Drugs Case | పార్టీలకు ఎవరెవరు వచ్చేవాళ్లు?