కెరీర్లో తొలిసారి పోలీస్గా అవతారమెత్తింది త్రిష. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్సిరీస్ ‘బృందా’.సూర్య వంగల దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సిరీస్ షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా జరుగుతున్నది. ఇందులో త్రిష హైదరాబాద్ పోలీస్ ఆఫీసర్గా శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నది. వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఈ సిరీస్ను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఖాకీ దుస్తులు ధరించి డైలాగ్ పేపర్ను పట్టుకొని ఉన్న ఆన్లొకేషన్ స్టిల్ను ఆదివారం త్రిష ట్విట్టర్లో పోస్ట్చేసింది. సుదీర్ఘ సినీ ప్రయాణంలో త్రిష పోలీస్ పాత్రలో కనిపించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ సిరీస్తోనే ఆమె ఓటీటీ ప్లాట్ఫామ్లోకి అడుగుపెట్టబోతున్నది. ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా, ఆయన సోదరుడు అశోక్ కొల్లా ఈ వెబ్సిరీస్ను నిర్మించబోతున్నారు. ఈ సిరీస్లో సాయికుమార్, ఆమని కీలక పాత్రలను పోషిస్తున్నారు.