విజయ్శంకర్, అషూరెడ్డి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఫోకస్’. జి.సూర్యతేజ దర్శకుడు. రిలాక్స్ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టు మొదటివారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇటీవల విడుదలైన టీజర్కు మంచి ఆదరణ లభించింది. మర్డర్ మిస్టరీ బ్యాక్డ్రాప్లో ఆద్యంత ఉత్కంఠభరితమైన కథతో న్యూఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్గా చిత్రాన్ని తెరకెక్కించాం’ అన్నారు. సుహాసిని మణిరత్నం, భానుచందర్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యజమాన్య.