జై రమేష్, శ్రీదేవి, రుక్మిణి, భానుచందర్, కోట శంకర్రావు, శాంతకుమార్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘మిస్టర్ ధర్మ’ (బ్రదర్ ఆఫ్ యమ). ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి మూవీస్ పతాకంపై ప్రదీప్ రాజ్ దర్శకత్వంలో రమేష్ ఆర్కే నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ను ఫిలించాంబర్ అధ్యక్షుడు బసిరెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా బసిరెడ్డి మాట్లాడుతూ..‘కమర్షియల్ అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తున్నది.
దర్శక నిర్మాతల ప్రయత్నం విజయవంతం కావాలి’ అన్నారు. నిర్మాత రమేష్ ఆర్కే మాట్లాడుతూ…‘పోలీస్ కథతో ఈ చిత్రాన్ని నిర్మించాను. పాటలు, ఫైట్స్, ఆకట్టుకునే సన్నివేశాలతో దర్శకుడు ఆసక్తికరంగా సినిమాను రూపొందించారు.’ అన్నారు.