టికెట్ టూ ఫినాలే రేసులో భాగంగా మూడో లెవల్ స్కిల్ ఛాలెంజ్ ఇవ్వగా తక్కువ పాయింట్స్ సాధించిన కాజల్, ప్రియాంక తప్పుకున్నారు. ఇక పదేసి పాయింట్లు దక్కించుకున్న షణ్ముఖ్-సన్నీలకు టై అయ్యింది. దీంతో మూడో పోటీదారుల్లో షణ్ముఖ్-సన్నీ టై బ్రేకర్ పెట్టారు.. ఈ టై బ్రేకర్ గెలిచిన వాళ్లే టికెట్ టు ఫినాలేకి వెళ్తారని చెప్పారు. మళ్లీ ఈ ఇద్దరూ పోటీపడగా.. షణ్ముఖ్ 22 సెకన్ల వ్యవధిలో బాల్స్ వేస్తే.. సన్నీ 20 సెకన్ల వ్యవధిలో బాల్స్ వేశాడు.
షన్నూపై 2 సెకన్ల స్వల్ప తేడాతో గెలిచి.. టికెట్ టు ఫినాలేకి అర్హత సాధించాడు సన్నీ. షణ్ముఖ్ ఓడిపోవడంతో అతడు కూడా ఈ రేసు నుండి తప్పుకున్నాడు. చివరకు టికెట్ టూ ఫినాలే రేసులో మానస్.. శ్రీరామ్.. సిరి.. సన్నీ ఉన్నారు. ఈ నలుగురు టికెట్ టు ఫినాలే కోసం తలపడనున్నారు. అయితే అందరికంటే ఎక్కువగా మానస్ 18 పాయింట్లతో ముందున్నాడు.
తరువాత స్థానంలో 16 పాయింట్లతో శ్రీరామ్ ఉన్నాడు. 15 పాయింట్లతో సిరి మూడో స్థానంలో ఉంది. 10 పాయింట్లతో సన్నీ టికెట్ టు ఫినాలేకి అర్హత సాధించిన వారిలో చివరి స్థానంలో ఉన్నాడు. నలుగురిలో ఎవరు విజేతగా నిలిచి టికెట్ టూ ఫినాలే టికెట్ సంపాదిస్తారో, ఎవరు తొలి టాప్ 5 కంటెస్టెంట్ అవుతారా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి నేడు క్లారిటీ రానుంది.