ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ‘రాధేశ్యామ్’ ప్రచార కార్యక్రమాలు ఊపందుకోబోతున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించిన ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి. కాగా ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను ఈ నెల 23న హైదరాబాద్లో నిర్వహించబోతున్నారు. అదే రోజు ఐదు భాషలకు సంబంధించిన ట్రైలర్ను విడుదల చేయనున్నారు. అభిమానులే అతిథులుగా ఈ వేడుకకు నిర్వహించబోతున్నామని, ట్రైలర్స్ కూడా వాళ్లే ఆవిష్కరిస్తారని చిత్రబృందం పేర్కొంది. పూజాహెగ్డే, కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ఖేడ్కర్, ప్రియదర్శి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మనోజ్పరమహంస, నిర్మాతలు: వంశీ, ప్రమోద్, ప్రసీధ, నిర్మాణ సంస్థలు: గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: కె.కె.రాధాకృష్ణకుమార్.