ప్రముఖ కథానాయకుడు రవితేజ నిర్మిస్తున్న చిత్రం ‘ఛాంగురే బంగారు రాజా’. సతీష్ వర్మ దర్శకుడు. కార్తీక్ రత్నం కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో గోల్డీ నిస్సీ కథానాయిక. రవిబాబు, సత్య ఈ చిత్రంలో ఇతర ప్రధాన తారాగణం. ఇటీవల ఈ చిత్రం టీజర్ను రవితేజ విడుదల చేశారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘పూర్తి వినోద్మాకంగా రూపొందుతున్న చిత్రమిది. క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం హిలేరియస్గా వుంటుంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కృష్ణ సౌరభ్.