‘ప్రపంచానికి తెలిసిన పంచభూతాలు ఐదు..కానీ ఆరో భూతం ఒకటుంది..అదే డబ్బు’ అనే సంభాషణతో మొదలైన ‘ఎఫ్-3’ ట్రైలర్ ఆద్యంతం నవ్వుల్ని పంచుతూ సాగింది. డబ్బు వల్ల వచ్చే సమస్యల్ని వినోదాత్మక కోణంలో ఆవిష్కరిస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వెంకటేష్, వరుణ్తేజ్ కథానాయకులుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ నెల 27న విడుదలకానుంది. సోమవారం థియేట్రికల్ ట్రైలర్ను రిలీజ్ చేశారు. డబ్బు నేపథ్యంలో మధ్యతరగతి మనస్తత్వాల్ని వినోదాత్మకంగా చూపిస్తూ ట్రైలర్ నవ్వుల్ని పూయించింది. ‘పాతిక లక్షలు..తెల్లారేసరికి యాభై లక్షలైపోవాలి’ ‘డబ్బున్నవాడికి ఫన్..లేనివాడికి ఫ్రస్ట్రేషన్..’ వంటి డైలాగ్లు ఆకట్టుకున్నాయి. వెంకటేష్, వరుణ్తేజ్, సునీల్, వెన్నెల, కిషోర్, తమన్నా, మెహరీన్ తమదైన హాస్యంతో మెప్పించారు. రాజేంద్రప్రసాద్, సోనాల్చౌహాన్, పూజాహెగ్డే (స్పెషల్ అప్పీయరెన్స్) తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సహనిర్మాత: హర్షిత్ రెడ్డి, నిర్మాత: శిరీష్, దర్శకత్వం: అనిల్ రావిపూడి.