వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలలో అనీల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ఎఫ్ 2. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో సీక్వెల్గా ఎఫ్ 3 తెరకెక్కిస్తున్నారు.. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మీద శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్నా, మెహరీన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.ఈ సినిమాకు మరింత గ్లామర్ డోస్ను ఇచ్చేందుకు హీరోయిన్ సోనాల్ చౌహాన్ను ఎంపిక చేశాఉ.
సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేయగా, అక్కడ భారీ పోటీ నెలకొని ఉండడంతో చిత్రాన్ని 2022, ఫిబ్రవరి 25న గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు. మేకర్స్ ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇక ఈ సినిమాలో ఫన్ డోస్ పెంచనున్నాడు అనిల్. వెంకీ, వరుణ్ , రాజేంద్ర ప్రసాద్ కామెడీకి సునీల్ కూడా యాడ్ అవ్వడంతో ఈ సినిమాలో మరింత ఎంటర్టైన్మెంట్ ఉండనుంది.